బంజారాహిల్స్ : జాతీయ నెమళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లోని కేబీఆర్ నేషనల్ పార్కులో నెమళ్లను లెక్కించే కార్యక్రమం బుధవారం ప్రారంభమయింది. సీసీఎఫ్ ఎంజే అక్బర్ ఆధ్వర్యంలో బుధవారం పార్కులో నిర్వహించిన సమావేశంలో నెమళ్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు.
ఈ సందర్భంగా సీసీఎఫ్ ఎంజే. అక్బర్ మాట్లాడుతూ..మూడురోజుల పాటు కేబీఆర్ పార్కులో నెమళ్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని, దక్కన్ బర్డ్వాచర్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ స్వచ్చంద సంస్థలకు చెందిన 40మంది వాలంటీర్లు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
పార్కులో అన్ని ప్రాంతాల్లో తిరిగి నెమళ్ల సంఖ్యను మదింపు చేస్తారని పేర్కొన్నారు. డిసెంబర్ 3న పీకాక్స్ డే రోజున నెమళ్ల సంఖ్యను వెల్లడిస్తామని, పార్కులో గతంతో పోలిస్తే నెమళ్ల సంఖ్య పెరిగిందా , తగ్గిందా అనే అంశాలను తెలుసుకునేందుకు ఈ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్వో జోజి, ఫ్లయింగ్ స్కాడ్ డీఎఫ్ఓ అశోక్కుమార్, రేంజ్ అఫీసర్ అనురాధ, విశ్రాంత అటవీ అధికారి శంకరన్, జ్యోతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.