గోల్నాక : వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎం రిలిఫ్ఫండ్ ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
గురువారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న గోల్నాక డివిజన్ ఖాద్రీబాగ్కు చెందిన అమీనాబేగంకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2లక్షల విలువగల ఆమోదపత్రాన్ని ఆయన బాధితురాలి కుటుంబసభ్యులకు అందజేశారు.