సికింద్రాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స జరిపించుకోడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహయనిధి (ఎల్ఓసీ)ని అందజేశారు. సీతాఫల్మండికి చెందిన సడియాబేగం, స్రవంతిలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్థిక సహయం కోసం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ను ఆశ్రయించగా ఆయన వారిచే ముఖ్యమంత్రి సహయనిధికి దరఖాస్తు చేయించి ఒక్కోక్కరికి రూ. 2లక్షల చొప్పున మంజూరైన పత్రాలను సికింద్రాబాద్లోని ఆయన కార్యాలయంలో అందజేశారు.