బంజారాహిల్స్ : అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ను నడిపిస్తున్న నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని వైట్ ర్యాబిట్ పబ్ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నడిపిస్తున్నారన్న సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు శనివారం అర్థరాత్రి తనిఖీలు చేశారు.
ఈ మేరకు సీసీ కెమెరా ఫుటేజీలతో పాటు వివరాలను సేకరించిన పోలీసులు పబ్ యజమానులు సందీప్, ఆనంద్తో పాటు మేనేజర్ అశిష్ ఠాకూర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.