బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద కుక్కపిల్లలను చంపడంతో పాటు పావురాలను హింసిస్తున్నా బాలుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్ రోడ్ నెం. 2 లోని ఇందిరానగర్ బస్తీకి చెందిన బాలుడు(16) గత కొంత కాలంగా కేబీఆర్ పార్కులో ఆవారాగా తిరుగుతూ కనిపించిన మూగజీవాలను హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 21న కేబీఆర్ పార్కు వాక్వేలో మూడు కుక్కలను అతి కిరాతకంగా రబ్బర్ బెల్ట్తో కొట్టి చంపేశాడు. అదే ప్రాంతంలోవాకింగ్ చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ అండ్లీబ్ జైది అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. ఈ మేరకు శుక్రవారం ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై ఐపీసీ 409తో పాటు జంతుహింస కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు.