రాజాపేట, ఏప్రిల్ 4 : దేశంలో అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రేణికుంట, కాల్వపల్లి, చల్లూరు, బేగంపేట, రాజాపేటలో ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. అభివృద్ధిలో మన రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదన్నారు. అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధికి అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేయాలని సూచించారు. అందరి బాగు కోసం నిరంతరం తపించే మహానాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గ్రామాల అభివృద్ధికి నిధులు, గడపగడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, వైస్ ఎంపీపీ కాయితి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోశ్గౌడ్, మండల సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, డైరెక్టర్లు గుంటి కృష్ణ, చింతలపూరి వెంకట్రాంరెడ్డి, అర్కాల గాల్రెడ్డి, సర్పంచులు బూర్గు భాగ్యమ్మానర్సిరెడ్డి, నర్సయ్య, కర్ణాకర్, గుంటి మధుసూదన్రెడ్డి, ధర్మేందర్సింగ్, రాజు, గోపిరెడ్డి, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 125మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్షి చెక్కులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ గిరిధర్, ఆర్ఐ సలీం, ప్రభుదాస్, ఎంపీడీఓ రామరాజు, ఎంపీఓ దినకర్, ఎంపీపీ బాలమణి, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, సర్పంచులు పాల్గొన్నారు.
కొలనుపాక జైనమందిరం సహకారంతో రాజాపేట మండలంలోని కొన్రెడ్డిచెర్వు, మల్లెగూడెం గ్రామాలకు చెందిన 40మంది విద్యార్థులకు సమకూర్చిన సైకిళ్లను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు సహకారం అందించిన దాతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు చెరుకు విజయాకనకయ్య, గొడుగు రాజు, బోనాల వెంకటేశ్ పాల్గొన్నారు.