ఎర్రగడ్డ : ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ అయిన బాబా ఫసియోద్దీన్కు చాదర్ను అందజేయగా మంగళవారం నాంపల్లిలోని యూసుఫ్ షరీఫ్ దర్గాలో చాదర్ను సమర్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, చిరుమళ్ల రాకేష్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.