సూర్యాపేట టౌన్, జనవరి 27 : థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్న రోజును ఎలక్ట్రీషన్ డేగా జరుపుకోవడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎలక్ట్రీషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ జెండా ఆవిష్కరించడంతో పాటు క్యాలెండర్ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, ఎలక్ట్రీషియన్లు మహిమూద్ అలీ, నబీ, లింగారెడ్డి సోమయ్య, మధు, శ్రీనివాస్, విఠల్రెడ్డి, జానయ్య, నాగరాజు, బ్రహ్మచారి, సత్యనారాయణ పాల్గొన్నారు.