ఆర్మూర్, జనవరి 20 : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గురువారం ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అర్వింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. మూడేండ్లలో ఎంపీ అర్వింద్ జిల్లాలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న నాయకులపై ఇష్టారీతిన మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమాల్లో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బండారి ప్రసాద్, తాటి హన్మాండ్లు, బారడ్ రమేశ్, ఫయాజ్, రాజ్కుమార్, లిక్కి శంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్, ఖాందేశ్ శ్రీనివాస్, గోవింద్పేట్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాశిరెడ్డి, ఆర్మూర్ పట్టణ యూత్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, మీరా హన్మంత్, మీరా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.