బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో అభివృద్ది పనులను చేపట్టేందుకు ఎమ్మెల్సీ కోటాలో నిధులను కేటాయించాలని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి బుధవారం ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావును కోరారు.
డివిజన్ పరిధిలోని జహీరానగర్, సింగాడబస్తీ, ప్రతాప్నగర్, తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు పాడయ్యాయని, వాటి స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్సీ ప్రభాకర్రావు సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, నాయకులు గణేష్, ఎస్ఎమ్.జావెద్, అశ్వక్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.