ఇచ్చోడ, మే 15 : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత ఫర్టిలైజర్స్ డీలర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తన టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్ దుకాణాలను విత్తన టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీ చేశారు. బీటీ -3 పత్తి విత్తనాలకు రాపిడ్టెస్ట్ చేశారు. విక్రయదారులు రికార్డులు స్పష్టంగా రాయాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు పూర్తి వివరాలతో కూడిన రసీదులు ఇవ్వాలన్నారు కార్యక్రమంలో వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఏడీఏ సుధాకర్ బాబు, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ ఏడీఏ శంకరయ్య, ఎస్ఐ పురుషోత్తం, ఏవో జాదవ్ కైలాస్, ఏఈవో అనుదీప్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు
ఇంద్రవెల్లి, మే 14 : మండల కేంద్రంతో పాటు ముత్నూర్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను రాష్ట్ర స్థాయి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం అధికారులు తనిఖీలు చేశారు. విత్తనాలతో పాటు ఎరువుల స్టాక్ నమోదు చేసిన రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం అధికారులు (ఏడీఏ) సుధాకర్బాబు, వ్యవసాయ శాఖ కెమికల్ టెక్నీషియన్ శంకరయ్య, రాష్ట్ర స్థాయి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం సీఐ పురుషోత్తమాచారి, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ రమేశ్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, ఏవో రాథోడ్ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, మే 14 : ఆదిలాబాద్లోని పలు విత్తన దుకాణాలను రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం అధికారులు తనిఖీ చేశారు. హెచ్టీ కాటన్ స్ట్రిప్ టెస్ట్ చేశారు. హెచ్టీ జన్యువు ఉందా లేదా అని పరీక్షలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కమిషనరేట్ ఏడీ సుధాకర్ బాబు మాట్లాడుతూ విత్తన డీలర్లు రైతులకు అనుమతిలేని, ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు అమ్మడం నేరమని అన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, ఏడీఏ రమేశ్, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ శంకరయ్య, సీఐ పురుషోత్తం, ఆదిలాబాద్ ఏవో రమేష్ ఉన్నారు.
ఎదులాపురం, మే 14 : విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ హరిబాబు అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిచ్చిధరి, ఖనాపూర్ గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు, సర్పంచ్లు ఉన్నారు.
సిరికొండ, మే 14 : మండలంలోని సొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దోబి గూడ, సొంపల్లి గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారి ప్రవీణ్ రైతులకు వానకాలం సాగు సన్నద్ధత, నకలీ విత్తనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శకుంతలబాయి, ఉపసర్పంచ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.