రాంనగర్, మార్చి 30: నిరంతరం రక్షణ చర్యలతోనే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించవచ్చని రాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఆడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య పేర్కొన్నారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో 500కు పైగా ప్రమాదాలను నియంత్రించామని చెప్పారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో బుధవారం కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్షించారు. అతివేగం.. ఓవర్ లోడ్ కారణంగా ఎకువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు భవనాల శాఖ అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతూ యాక్సిడెంట్లను తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూడళ్ల వద్ద ఏపుగా పెరిగి ఉన్న చెట్లు, మొకలను తొలగించాలని సూచించారు. రాష్ట్ర జాతీయ రహదారులోనే ఎకువశాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణకు పోలీసు శాఖ గ్రామాల్లో కళా బృందాలతో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నదన్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా, పెట్రోల్ బంకుల వద్ద ప్రమాదాలు జరిగేందుకు ఆసారం ఉన్న ప్రాంతాల్లో బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు వాహనాల పై పోస్టర్లను అంటించే కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వివరించారు. ‘రహదారి భద్రత – మనందరి బాధ్యత’పేరిట రూపొందించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ఈ సందర్భంగా ఆవిషరించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రకాల చర్యలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇక్కడ డీటీసీ చంద్రశేఖర్గౌడ్, కరీంనగర్, రామగుండం కమిషనర్లు వీ సత్యనారాయణ, చంద్రశేఖర్రెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు రాహుల్ హెగ్డే, సింధూ శర్మ, సిద్దిపేట అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఏసీపీలు శ్రీనివాసరావు, విజయసారథి, మదన్లాల్, సీ ప్రతాప్ తదితరులు ఉన్నారు.