చిక్కడపల్లి : దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మణం పాలుకావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అడిక్మెంట్ డివిజన్లోని రాంనగర్ గుండు దగ్గర బిపిన్ రావత్ సంతాప సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ బిపిన్ రావత్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమిళనాడు లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి (చిఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన సతీమణి తో పాటు మరో 11 మంది సైనిక సిబ్బంది మరణించడం అత్యంత విచారకరం అని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యామ్ సుందర్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగనం నాయకుడు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సురేందర్, అస్లాం, నేతశ్రీను, ప్రేమ్, మల్లికార్జున్రెడ్డి, మాధవ్,సుబ్బారావు,హరీశ్, ఎస్.యాదగిరి, రాజు,సాయి,ప్రసన్న, శైలజ తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య పార్కులో..
భారత త్రివిధదళపతి బిపిన్ రావత్తో పాటు మరణించిన సైనికాధికారులకు బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో వాకర్స్ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షుడు వి.నాగభూషణం, వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, కందూరి కృష్ణ, క్లబ్ ప్రతినిధులు ఆర్.వివేక్, కోటేశ్వర రావు, పాండయ్య, పాలమూరు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి, ఆర్.జయదేవ్ తదితరలు పాల్గొన్నారు.