గోల్నాక : తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం గోల్నాక డివిజన్ మారుతీనగర్ బస్తీ వాసులు గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలసి తమ సమస్యలు వివరించారు.
ముఖ్యంగా మంచినీటి సమస్యతో పాటు బస్తీలో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతుండం, సీసీ రోడ్డు పనులు నిలిపివేయడంతో పాటు లో-ఫ్రెషర్ మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు.
వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని బస్తీ వాసులకు సూచించారు. ఈ సమావేశంలో డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ఇన్స్పెక్టర్ రవి, మనోహర్, జలమండలి ఏఈ రోహిత్తో పాటు మారుతీనగర్ వాసులు మధుసూధన్, సత్యనారాయణ, శ్రీనివాస్, సురేశ్, వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.