వెంగళరావునగర్ : వరదనీటి సమస్యకు శాశ్విత పరిష్కారం కోసం పనులు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ నాగార్జుననగర్ కాలనీలో రూ.30.60 లక్షల వ్యయంతో వరదనీటి పైపులైన్ శంకుస్థాపన పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం విజయ టవర్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ వరదలు వచ్చిన సమయంలో కాలనీ ముంపునకు గురవుతుండటంతో.. ఆ సమస్య ఇక ముందు రాకుండా ఉండేందుకు ఈ పనులు చేపట్టామని పేర్కొన్నారు. డ్రైనేజీ పనుల కోసం రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేశామని అన్నారు.
డ్రైనేజీ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదంటూ స్థానికులు ఎమ్మెల్యే మాగంటి దృష్టికి తేగా.. ఆయన వెంటనే జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. రోడ్డు తవ్వేందుకు అనుమతుల విషయం వల్ల పనులు చేపట్టడంలో జాప్యం జరిగిందని.. రెండు,మూడు రోజుల్లోనే ఈ పనులు చేపడ్తామని జోనల్ కమిషనర్ రవికిరణ్ ఎమ్మెల్యే మాగంటికి చెప్పారు.
సమస్యను సత్వరమే పరిష్కరించడానికి చొరవ చూపిన తీరును చూసిన కాలనీవాసులు కరతాళ ధ్వనులతో అభినందించారు. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జలమండలి, జీహెచ్ఎంసీ విభాగాల మధ్య సమన్వయంతో ఈ పనులను పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. సోమాజిగూడ డివిజన్ను ప్రగతిపథంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, విజయ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మరాజు,సెక్రటరీ ప్రసాద్,డివినజ్ అధ్యక్షుడు అప్పుఖాన్,ప్రధాన కార్యదర్శి మధుయాదవ్,నాయకులు తన్ను ఖాన్,శరత్ గౌడ్, నాగమణి, రాణి, కవిత, తదితరులు పాల్గొన్నారు.