గ్రామీణ ప్రాంత క్రీడాకారుల మూడుదశాబ్దాల కల నెరవేరింది. ప్రాక్టీస్ చేసేందుకు చిన్న మైదానం కూడా లేని కమ్మర్పల్లిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో మినీస్టేడియం రూపుదిద్దుకుంది. స్వయంగా వాలీబాల్ క్రీడాకారుడైన వేముల తమ మనసెరిగి మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయించారని క్రీడాకారులు సంబురపడుతున్నారు. రూ.2.5కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్, ఇన్డోర్ స్టేడియంను మంత్రి ప్రశాంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు.
వాలీబాల్ క్రీడాకారుడిగా..
స్వయంగా వాలీబాల్ క్రీడాకారుడైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రాష్ట్రస్థాయిలో రాణించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి దివంగత వేముల సురేందర్రెడ్డి సైతం వాలీబాల్ క్రీడాకారుడు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం, యువతకు మార్గనిర్దేశం చేసే తత్వమున్న మంత్రి వేము ల మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయించారు. క్రీడాకారులకు కొదువలేని కమ్మర్పల్లి ప్రాంతానికి ఇప్పుడు మినీస్టేడియం నిర్మాణంతో నూతన కల వచ్చింది. సరైన గ్రౌండ్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ఏకంగా మినీ స్టేడియం అందుబాటులోకి వచ్చిందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.