రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు
మేడిపల్లిలో 42 మందికి చెక్కుల పంపిణీ
మేడిపల్లి, అక్టోబర్ 29: కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఉద్ఘాటించారు. శుక్రవారం ఆయన జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి మేడిపల్లిలో పర్యటించారు. మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బోధనా తీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం పీఎన్ఆర్ గార్డెన్స్లో 42 మంది లబ్ధిదారులకు సుమారు 42లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. చందుర్తి, వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని 55 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నిర్భాగ్యుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే ఆసరా పథకం కింద ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వృద్ధులకు పింఛన్ ఇస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ వసంత పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షుడు వోద్దినేని హరిచరణ్రావు, ఎంపీపీ దోనకంటి రాజరత్నాకర్రావు, తహసీల్దార్ బషిరొద్దీన్, ఎంపీడీవో వెంకటేశ్జాదవ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, సర్పంచులు క్యాతం వరలక్ష్మి, గడ్డం నారాయణరెడ్డి, ఈర్నాల సంపత్కుమార్, ద్యావనపెల్లి అభిలాష్, తౌటి తిరుపతిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మిట్టపెల్లి రమేశ్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, మండల కో ఆర్డినేటర్ మిట్టపెల్లి భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.