ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న
బేల, జూన్ 26 : హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. హరితహారం, పల్లె ప్రగతిపై మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, అధికారులతో బేలలోని గార్డెన్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆరు విడుతల్లో చేపట్టిన హరితహారం విజయవంతమైందని, ఏడో విడుతకు ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. జూలై 1 నుంచి పట్టణాలు, పల్లెల్లో నిర్వహించే హరితహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా మొక్క లు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా గతంలో నాటిన మొక్కల వివరాలతో పాటు, ఈ సారి నాటే మొక్కల ప్రణాళికలను కార్యదర్శులను ఆడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లోని సమస్యలను సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఆధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మండలంలోని కొగ్దూర్కుకు చెందిన ప్రవళికకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.20 వేల విలువైన చెక్కు మంజూరు కాగా ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ , ఎంపీపీ వనిత ఠాక్రే, జడ్పీటీసీ పవర్ అక్షిత, మండల ప్రత్యేకాధికారి ఎస్ఈ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్, నాయకులు గంభీర్ఠాక్రే, సతీశ్ పవర్, జక్కుల మధుకర్ , మంగేశ్ ఠాక్రే, ప్రమోద్రెడ్డి, ఇంద్రశేఖర్, మస్కే తేజ్రావు, వాడ్కర్ తేజ్రావు, విపిన్, బండి సుదర్శన్, తన్వీర్ఖాన్, సంతోష్, సర్పంచ్లు , కార్యదర్శులు పాల్గొన్నారు.
దవాఖాన సందర్శన
బేల పీహెచ్సీ శిథిలావస్థకు చేరుకోగా ఎమ్మెల్యే జోగురామన్న, ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తో కలిసి పరిశీలించారు. త్వరలోనే తాత్కాలిక భవనంలో దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పీహెచ్సీలో వ్యాక్సినేషన్ వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనాన్ని డీఎంహెచ్వో తో కలిసి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుకూలంగా ఉందని, జిల్లా కలెక్టర్కు ఆరోగ్య కేంద్రం మార్పునకు విన్నవిస్తామని డీఎంహెచ్వో తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి క్రాంతి కుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.