వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
పంట సాగుపై హైదరాబాద్లో చర్చ
పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల, మే 25, నమస్తే తెలంగాణ : వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై హైదరాబాద్లోని హార్టికల్చర్ హాకా భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. రైతులు మూస పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలవైపు చూస్తున్నారని, ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే 30 ఏండ్ల పాటు ఆదాయం వస్తుందన్నారు. అంతరపంటలతో దిగుబడికి ముందే అధికలాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు. రైతులు కూడా సానుకూలంగా ఉన్నారని, ఆయిల్ పామ్ తోటలను విస్తరించాలని ఆ యన సూచించారు. నియోజకవర్గంలో సాగు చేస్తున్న ఆ యిల్ పామ్ సాగుపై ఈ సందర్భంగా విప్ బాల్క సు మన్ గుర్తుచేశారు. కర్బూజ, కూరగాయలు, ఆకుకూర లు, పండ్లతోటలు అంతరపంటలుగా వేసి పలువురు రై తులు లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్ రామ్రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.