కోట్పల్లి, జనవరి 24 : నాలుగైదు పంచాయతీలకో పంచాయతీ కార్యదర్శి ఉన్న నాటితో పోలిస్తే నేడు తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రజాపాలన వ్యవస్థలో ఎంతో మార్పు కనిపిస్తున్నది. గతంలో ప్రజలకు పంచాయతీ కార్యదర్శుల ఏ అవసరమైనా ఉందంటే.. ఏ గ్రామంలో కార్యదర్శి ఉంటాడో గ్రామగ్రామాన తిరిగి జనన, మరణ, తదితర ధ్రువీకరణ పత్రాలను పొం దాల్సి ఉండేది. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా మండలంలో 18 పంచాయతీలకుగాను 18 మంది పంచాయతీ కార్యద ర్శులను నియమించింది. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ తెలిపేలా కార్యదర్శుల వ్యవస్థను పటిష్ఠం చేసింది. అభి వృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పంచాయతీల రూపు రేఖలను మార్చింది. పంచాయతీల కార్యదర్శులంతా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తూ ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులు నిత్యం ఉదయం 7 గంటల నుంచి గ్రామానికి చేరుకుని ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారు. పారిశుధ్యం, ఇంటింటికీ ట్రాక్టర్ను పంపి చెత్తను సేకరించడం, వీధి దీపాలు, ప్రకృతివనం వంటి పనులపై పర్యవేక్షిస్తున్నారు. వీటిని వెంటనే కార్యదర్శులు తమ ఫోన్లో ఉన్న యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు వాటి ఫొటోలు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, రోజువారీ పనుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి.