బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
తాంసిలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాంసి, జూన్ 16 : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్నల కొనుగోలు గురించి సీఎం కేసీఆర్కు విన్నవించిన మరుక్షణమే కొనుగోలుకు సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పంటలను కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అడ్ఢి భోజారెడ్డి, వైస్చైర్మన్ ధనుంజయ్, ఎంపీపీ సురుకుంటి మంజుల, శ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఆర్బీఎస్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కేశవ్, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి నాగారెడ్డి, సర్పంచ్లు కృష్ణ, వెంకన్న, కేశవ్రెడ్డి, సదానందం,యశ్వంత్, నర్సింగ్, ఎంపీటీసీలు నరేశ్, రఘు, అశోక్, డైరెక్టర్లు చంద్రన్న, బుజ్జన్న, అశోక్రెడ్డి పాల్గొన్నారు.