విద్యావేత్తగా.. అనువాదకుడిగా జలజం సత్యనారాయణకు గుర్తింపు
ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 14 : సాహితీ సవ్యసాచి జలజం సత్యనారాయణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. విద్యావేత్తగా, సాహితీవేత్తగా, అనువాదకుడిగా ఆయన ప్రఖ్యాతిగాంచారన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జలజం సంస్మరణ సభకు మంత్రి హాజరయ్యారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జలజం సాహితీవేత్తగా గొప్ప పేరు తెచ్చుకున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలో విద్యాసంస్థలు స్థాపించి ఎందరో విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిరంతరం తన రచనలు, సాహిత్యంతో సమాజానికి మార్గదర్శనం చూపేవారన్నారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ అధ్యక్షుడు మణికొండ వేదకుమార్ , ప్రముఖ న్యాయవాది మనోహర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, కవులు లక్ష్మణ్గౌడ్ మాట్లాడుతూ జలజం సేవలను కొనియాడారు. అనంతరం జలజంపై రూపొందించిన వెబ్సైట్ను మణికొండ వేదకుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కవులు వెంకటేశ్వర్రెడ్డి, భీంపల్లి శ్రీకాంత్, జగపతిరావు, రావూరి సూర్యనారాయణ, విజయ్కుమార్, జయరాములు, జలజం కళాశాల కరస్పాండెంట్ రమేశ్గౌడ్, జలజం కుటుంబ సభ్యులు సుష్మారాయ్, వైషుషిరాయ్, విదుషిరాయ్, నాతి రవిచందర్, దామోదర్, లిటిల్స్కాలర్స్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ క్రీడలో రాణించాలి
బ్యాడ్మింటన్ క్రీడలో జిల్లా క్రీడాకారులు రాణించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. ఆదివారం ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా బ్యాడ్మింటన్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అకాడమీలో ఉచిత శిక్షణ అందజేయాలని కోరారు. జిల్లాలో ప్రతిభగల క్రీడా కారులకు కొదవ లేదన్నారు.
రోడ్డు పనుల పరిశీలన
మహబూబ్నగర్ వన్టౌన్ చౌరస్తాలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, పైపులైన్ పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. పనులు నాణ్యతతోపాటు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. చౌరస్తాల పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఇండియన్ బ్యాడ్మింటన్ మాజీ కోచ్ మహ్మద్ సియాదతుల్లా, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, నిర్వాహకులు ముజాహిద్ పటేల్, ఇమ్రాన్ ఉస్మాన్, షౌకత్ హష్మి, అహ్మద్ ఉబేద్, నాయకులు జాకీర్ అడ్వకేట్, అన్వర్పాషా, అబ్దుల్ హాదీ, మోసిన్ఖాన్, షోయబ్అలీ, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.