కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి సన్నాహాలు
పెద్దపల్లి జంక్షన్ జూన్ 14: జిల్లా కేంద్రంలోని కల్వల క్యాంపులో జీ +2 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ నిర్మాణ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనులు సోమవారం ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 24 ఎకరాల స్థలంలో రూ. 48. 7 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు 99 శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు. మిగతా పనులు ఈ నెల 21వ తేదీలోగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, అర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి పర్యవేక్షించాలని సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
నిబంధనలు పాటిస్తూ ట్రిబ్యునల్
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వర్చువల్ విధా నం ద్వారా ట్రిబ్యునల్ నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలపై కలెక్టరేట్లో ట్రిబ్యునల్ నిర్వహించారు. వర్చువల్ విధానం ద్వారా లాయర్లు తమ వాదనలు వినిపించారు. కోర్టు కేసుల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని వివరించారు. ఇక్కడ భూ విభాగపు పర్యవేక్షకులు అనుపమారావు, ఈడీఎం కవిత ఉన్నారు.