కారుణ్య నియామకాల ద్వారా 13 వేల మందికి ఉద్యోగాలు
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
ఆర్కే న్యూటెక్ గనిపై సమావేశం.. చేరికలు
శ్రీరాంపూర్, ఆగస్టు 9 : తెలంగాణ ప్రభుత్వ చొరవతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతున్నాయని, సీఎం కేసీఆర్కు ప్రతి కార్మికుడూ అం డగా నిలవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఆర్కే 7న్యూటెక్ గనిపై టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో యాజమాన్యం ఆమోదం తెలిపిందని, ఈ నెల 11న యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయనుందన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసి కోరడం వల్లే వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. సింగరేణిలో కారుణ్య నియామకాల వల్ల నేడు సంస్థలో 13 వేల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్న టీబీజీకేఎస్ను తిరిగి గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. కాసిపేట గనిలో ఓవర్మెన్ సాయిక్రిష్ణ అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే యాజమాన్యంతో చర్చించి తిరిగి అతడికి ఉపరితలంలో ఓవర్మెన్గా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం వెంకట్రావ్ను గని కార్మికులు, నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
టీబీజీకేఎస్లో బీఎంఎస్ పిట్ కార్యదర్శి చేరిక
శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్ గని బీఎంఎస్ పిట్ కార్యదర్శి కమలాకర్రెడ్డి, మైనింగ్ స్టాఫ్ సమ్మ య్య, సత్యనారాయణ, బదిలీ వర్కర్లు, ఇతర యూనియన్లకు చెందిన 50 మంది టీబీజీకేఎస్లో చేరగా అధ్యక్షుడు వెంకట్రావ్, కేంద్ర ఉపాధ్యక్షుడు డీ అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి కండువాలు కప్పి యూనియన్లోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఏరియా కార్యదర్శి కానగంటి చంద్రయ్య, మాజీ సర్పంచ్లు జక్కుల రాజేశం, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, బుస్స రమేశ్, పిట్ కార్యదర్శులు శ్రీరాములు, ఎంబడి తిరుపతి, సత్యనారాయణ, పెంట శ్రీనివాస్, రాయమల్లు, మెండ వెంకటి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు చిలువేరు సదానందం, మహిపాల్రెడ్డి, భాస్కర్, నీలం సదయ్య, కుర్సు దుర్గయ్య, శంకర్ పాల్గొన్నారు.