సారంగాపూర్, మే 5 : కరోనా ఆపత్కాలంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపకుండా పేదలకు అండగా నిలుస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సారంగాపూర్, బీర్పూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల ఆవరణలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కు లను అందజేశారు. బీర్పూర్ మండలానికి చెందిన 24 మందికి రూ, 24లక్షల 2వేల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను, పలువురికి రూ, 53వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి చెక్కు తీసుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే సొంత ఖర్చులతో చీరెలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పథకాలు పేద కుటుంబాలకు వరంలా మరాయన్నారు. అనంతరం కందెనకుంట గ్రామంలో బీర్పూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపెల్లి మ నోహర్ రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, వైస్ ఎం పీపీ సొల్లు సురేందర్, రైతుబంధు జిల్లా కన్వీనర్ కొల్ముల రమణ, పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేందర్ రెడ్డి, నారపాక రమేశ్, సింగిల్ విండో చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.