ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
హైదరాబాద్ తరహా వరంగల్ అభివృద్ధి
ఎన్నికలప్పుడే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కనిపిస్తరు
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ
నగరంలోని పలు డివిజన్లలో రోడ్ షో
సుబేదారి/కాజీపేట/న్యూ శాయంపేట, ఏప్రిల్ 27: సర్వమత సమానత్వాన్ని కాపాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పునరుద్ఘాటించారు. నగరంలోని పలు డివిజన్లలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి మంగళవారం ఆయన రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. 60వ డివిజన్ పరిధిలో ఫారెస్ట్ ఆఫీస్-వడ్డేపల్లి జంక్షన్ రోడ్డుషోలో ఆయన మాట్లాడుతూ ఆరున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో వరంగల్ నగరం సమగ్ర ప్రగతి సాధించిందన్నారు. నగర అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కారుగుర్తుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం అభినవ్ భాస్కర్ను గెలిపించి సర్కారుకు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కులమతాలకు అతీతంగా షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, ఆసరా పింఛన్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, బతుకమ్మ పండుగప్పుడు హిందువులకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తూ సర్వమత సమానత్వాన్ని కాపాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. వరంగల్ను హైదరాబాద్ తరహా అభివృద్ధి చేస్తున్నారని, ఇక్కడ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటించిన సందర్భాల్లో వందల కోట్ల నిధులు మంజూరు చేసి నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు.
నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థులను తప్పక గెలిపించుకోవాలన్నారు. దివంగత నేత, మాజీ మంత్రి, తెలంగాణ గళాన్ని అసెంబ్లీ సాక్షిగా వినిపించిన ప్రణయ్భాస్కర్ ప్రతిరూపమైన అభినవ్ భాస్కర్ను 60వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడు తప్ప ఎప్పుడూ కనిపించరని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు వరంగల్ అంటే అమితమైన ప్రేమ అని, దీన్ని హైదరాబాద్ తరహా అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. నగరంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూస్తుంటే 66 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని తేలిపోయిందని ధీమా వ్యక్తం చేశారు. అభినవ్ భాస్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.
అభినవ్ భాస్కర్కు అండగా ఉండి 60వ డివిజన్ను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, అభినవ్ భాస్కర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ చీఫ్ విప్ వినయ్భాస్కర్, ప్రభుత్వ పెద్దల సహకారంతో డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రచారంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు కేశబోయిన అరుణ, మిడిదొడ్డి స్వప్న, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రామ్రాజు,స్నేహలత, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు. రోడ్ షో తర్వాత అభినవ్ భాస్కర్ డివిజన్ ప్రజలతో భారీ ర్యాలీ తీశారు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్-వడ్డేపల్లి జంక్షన్ నుంచి వడ్డేపల్లి ఎంపీడీవో ఆఫీస్, తెలంగాణ చౌరస్తా, టీచర్స్ కాలనీ ఫేజ్-1, ఫేజ్-2, ఎస్బీహెచ్కాలనీ, విజయ్పాల్కాలనీ, ప్రణయ్ భాస్కర్కాలనీ, వడ్డేపల్లి పుర విధుల్లో డప్పుచప్పుళ్లు, కోలాటాలతో ర్యాలీ సాగింది.
61వ డివిజన్లో..
గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా 61వ డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. తాజా మాజీ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న అధ్యక్షతన ఫాతిమానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్విప్ వినయ్ భాస్కర్తో కలిసి మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి ఎలకంటి రాములును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్వప్న హయాంలో డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, ఇప్పుడు మరింత అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ పార్టీ డివిజన్ ఇన్చార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సతీశ్, రాజేశ్, పత్తి సంపత్రెడ్డి, కుమ్మరి కోటి లింగం, పుల్లయ్య, వెంకటస్వామి, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
49వ డివిజన్లో
పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ జూలైవాడ, రెవెన్యూ కాలనీలో హోమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కడియం, చీఫ్ విప్ దాస్యం ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదాబేగంను భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ నాయకులు ఎంఏ సమద్, విష్ణువర్ధన్, కుమార్, రాజయ్య, సంజీవ్, విక్రమ్, రాజూనాయక్ పాల్గొన్నారు.