పెద్దవంగర, ఏప్రిల్ 27 : క్షేత్రస్థాయిలో కొవిడ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల ప్రత్యేకాధికారి రావూరి రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కే శేషాద్రి, తహసీల్దార్ కే యోగేశ్వరరావు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, ఆరోగ్య, ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి వేగంగా ఉండడంతో గ్రామాల్లోని ప్రజలకు కొవిడ్పై అవగాహన కల్పించాలన్నారు. కరోనా బాధితులను మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి తరలించేలా ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో యాకయ్య, ఆర్ఐ సాయిబాబా ఉన్నారు.
పండుగలు నిర్వహించొద్దు..
నెల్లికుదురు: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున గ్రామాల్లో, తండాల్లో పండుగలు, ఉత్సవాలు నిర్వహించొద్దని, నిబంధలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని మం డల ప్రత్యేకాధికారి బాలరాజు హెచ్చరించారు. మండలంలోని సంధ్యతండా, వస్రాం, హేమ్లతండా గ్రామాల్లో దుర్గ మ్మ పండుగా, రాజులకొత్తపల్లిలో కాటమయ్య పండుగలు నిర్వహించాలని తేదీలను నిర్ధేశించుకున్న నేపథ్యంలో మంగళవారం మండల టాస్క్ఫోర్స్ బృందం ఆధ్వర్యం లో ఆయా గ్రామాల సర్పంచ్లతో ఎంపీడీవో సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పండుగలను రద్దు చేయాలని తెలిపారు. గ్రామాల్లో, తండాల్లో పెండ్లిళ్లు నిర్వహించుకోవడానికి తహసీల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకు పండుగలు, ఉత్సవాలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టాస్క్ఫోర్స్ బృందం, తహసీల్దార్ అనంతుల రమేశ్, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, ఎంపీవో పార్థసారథి, ఆయా గ్రామల సర్పంచ్లు పాల్గొన్నారు. కాగా, మండలంలోని మేచరాజుపల్లిలో కరోనా సోకిన ఇద్దరికి ఎంపీపీ మాధివినవీన్రావు వారిలో మనో ధైర్యాన్ని నింపి పండ్లు పంపిణీ చేశారు. ఆమె వెంట ఏఎన్ఎం రజిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తొర్రూరు: వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని తహసీల్దార్ రాఘవారెడ్డి సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విందు, వినోదాలు జరుపుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు.
నర్సింహులపేట : మండలంలోని అన్ని పంచాయతీల్లో, తండాల్లో అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని తహసీల్దార్ ఇమానుయెల్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
చిన్నగూడూరు: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి పీహెచ్సీ వైద్యుడు రవికుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని ఉగ్గంపలి ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి. భౌతిక ధూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.