Varalakshmi Vratam 2023 | శ్రావణమాసంలో రెండో శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు వరాలతల్లి వరలక్ష్మీ వ్రతాలకు ప్రత్యేకం. అతివలకు ఎంతో ఇష్టమైన పర్వదినాన సౌభాగ్యదాయిని లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించనున్నారు. తర్వాత మహిళలు తమ ఇండ్లల్లో భక్తిప్రపత్తులతో వ్రతాలు ఆచరించి తల్లికి నీరాజనం పలకనున్నారు.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజు వీలు కాని వారు ఆ తరువాత వచ్చే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చునని వేధ పండితులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ నెల 25 న శుక్రవారం అమ్మవారి వ్రతాన్ని ఆ చరించేందుకు మహిళలు సంసిద్ధులయ్యారు.
అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ దేవికి ప్రత్యేకత స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమై న, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసం లో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్థిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారత దేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయా ల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించిన శ్రీలక్ష్మీని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే.
సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు ప్రసాదించే వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. అన్ని మాసాల్లో కన్నా శ్రావణమాసం శివకేశవులతో పా టు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొదటగా లక్ష్మీదేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. విష్ణుమూర్తిని నారాయణ స్వరూపుడిగా లక్ష్మీదేవిని వరలక్ష్మీగా భావించి వ్రతం ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. స్కంద పురాణంలో సైతం శివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యతను గురించి వివరించారు. వ్రతం ఆచరించి తోటి సుహాసినులకు పసుపు, కుంకుమలు అందజేసి ఆశీస్సులు తీసుకుంటారు. చారుమతి కథను చదువుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పెండ్లి అయిన ప్రతి మహిళా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతారు.
వరలక్ష్మీ వ్రతం రోజు ఉదయమే లేచి స్నానం చేసి పట్టు వస్ర్తాలు ధరించి జగన్మాత వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించడం మన సాంప్రదాయం. ఇంటిని మామిడి తోరణాలు, . బంతి పువ్వులతో అలంకరించుకుని, గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు దిద్దుతారు. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశంలోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తర్వాత అథాంగ పూజ చేయాలి. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చది వి, దూప, దీ నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూ ర నీరాజనం, మంత్ర పుష్పం సమర్పించి మంగళ హారతి ఇవ్వాలి. తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వంటి వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం ఉదయం సింహ లగ్నంలో 5.50 నుంచి 7.40, వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 12.15 నుంచి 2.30 వరకు లేదా సాయంత్రం కుంభలగ్నంలో 6.10 నుంచి 7.55 వరకు ఆచరించాలని వేదపండితుడు ప్రకాశ్శర్మ తెలిపారు.
Lakshmi Devi | ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు