శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం (Srisaila Devasthanam) గోశాలలో తయారు చేస్తున్న గో ఉత్పత్తులను(Cow products) వినియోగించడం వలన మానవాళికి సకల శుభాలు, ఉపయోగాలు కలుగుతాయని ఈవో పెద్దిరాజు అన్నారు. బుధవారం అమ్మవారి ఆలయం పశ్చిమ మాడవీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన విక్రయశాలను (Sales hall) శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో దివ్యపరిమళ విభూతి, హోమపిడకలు, గోమయ అగరుబత్తులు, యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు, గో ఆర్క్, పళ్లపొడితో పాటు వివిధ గోమయ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ రామకృష్ణ, విశ్రాంత హర్టికల్చర్ డైరెక్టర్ ఈశ్వర్రెడ్డి, ఉద్యానవన అధికారి లోకేష్, ఏఈ భవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.