TTD | తిరుమల శ్రీవారి భక్తుల బిగ్ అలెర్ట్. ఈ నెలలో శ్రీవారి శ్రీవారి సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదలవనున్నది. సోమవారం ఉదయం 10 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను నమోదు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 20న లక్కిడిప్లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా విడుదలవనున్నది.
జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు 21న ఉదయం 10 గంటలకు భక్తులకు టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదలవనున్నది. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదలవుతుంది.
23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదలవుతుంది. 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టకెట్లను, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదలవుతుందని టీటీడీ పేర్కొంది. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వివరించింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.