తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. భక్తులకు మే ఒకటో తేదీ నుంచి శ్రీవారి మెట్లు మార్గంలో అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల మెట్ల మార్గం కొట్టుకుపోయాయి. ఈ మార్గంలో మరమ్మతులు పూర్తికావడంతో భక్తులకు అనుమతి స్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా నిన్న 76,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,574 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.