తిరుపతి : తిరుపతి(Tirupati) కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఆదివారం త్రిశూలస్నానం (Trisulasanam ) వైభవంగా జరిగింది. నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పుష్కరిణీలో అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ రామనామ స్మరణతో పులకించిన సప్తగిరులు
తిరుమల : లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం 8వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. అయోధ్యకాండలోని 26 నుంఇ 30వ సర్గ వరకు మొత్తం ఐదు సర్గల్లో 156 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 181 శ్లోకాలను పారాయణం చేశారు.