తిరుమల : తిరుమల ( Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల (April Month) కోటాను టీటీడీ (TTD) శనివారం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ టికెట్లు పొందిన భక్తులు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయని వివరించారు.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం ( Kalyanotsavam) , ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు , ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నామని వివరించారు.
జనవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు
ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు ( Srivani ) టికెట్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు , వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందని తెలిపారు.
జనవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందని, తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వివరించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.