Tirumala Brahmotsavam | తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధి చక్రత్తాళ్వార్కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు.
చక్రస్నానం క్రతువు ముగిసిన అనంతరం ఆనంద నిలయానికి మలయప్పస్వామి వారిని వేంచేపు చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి పూజలు చేశారు. రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై ఉభయదేవేరులతో కలిసి స్వామి వారి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు.