ఈ లోకంలో ఊహించని సమస్యలు , క్లిష్టమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన వ్యక్తిత్వాన్నీ ఖననం చేస్తాయి. మనతో కలబడతాయి. మనల్ని మనం కాకుండా మార్చేస్తాయి. భయపెట్టేస్తాయి. ఒక్కోసారి నిర్వీర్యులుగా మార్చి.. ఒంటరిని చేసి ఆడుకుంటాయి. అలాంటి సమయంలో మనం ఓ తోడు కోసం చూస్తాం. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సాయం ఆశిస్తాం. అయితే, ఇలాంటి సమయంలో మనకు దేవుడు గుర్తుకు రావాలి. ఆయన్ను మరచి, ఆయన తప్ప, ప్రతి మోసగాడినీ మనం నమ్మేస్తుంటాం. కానీ, ‘నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు.
నీకేమియూ తక్కువ కాదు’ అని దైవ వాక్కు చెబుతున్నది. ‘మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమౌనని దేవుడు హామీ ఇస్తున్నాడు’ అని ప్రభువు అభయమిచ్చాడు. పరిస్థితులు ఎలా ఉన్నా.. కలత చెందకూడదు. మన ప్రతి అడుగులో తోడుగా ఉంటానని దేవుడే హామీ ఇచ్చాడు. ఆ మాటపై విశ్వాసం ఉంచి ధైర్యంగా సాగిపోవడమే మనం చేయాల్సింది. ఇతరులను ఇబ్బందిపెట్టని ఏ పని చేపట్టినా.. దైవం అండగా నిలుస్తుంది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024