తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉందని ఆక్టోపస్(Octopus ) అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. ఎలాంటి భద్రతా ( Security )పరమైన సమస్యనైనా ఎదుర్కొనేందుకు ఆధునిక టెక్నాలజీతో సిద్ధంగా ఉందని వెల్లడించారు. తిరుమల (Tiumala ) అదనపు ఎస్పీ ముని రామయ్యతో కలిసి ఆయన ఆక్టోపస్, పోలీస్ ( Police ), ఫైర్(Firer), రెవెన్యూ, వైద్య, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలో మాక్ డ్రిల్స్(Makdrills ) నిర్వహించడంవల్ల భద్రత లోపాలను అధిగమించవచ్చన్నారు.
సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, అదే సమయంలో భక్తులకు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా తిరుమలలోని విశ్రాంతి గృహంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఏ విభాగం ఏ కార్యక్రమాలు నిర్వహించాలని విషయమై ఆక్టోపస్ డీఎస్పీ నరసింహారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సమావేశంలో తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి, టీటీడీ వీజీవో గిరిధర్, ఫైర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవీఎస్వోలు సతీష్, గిరిధర్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.