Srisailam | పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. 29వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇత, ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి.
ఇక చంద్రగ్రహణం రోజైన శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులను సర్వ దర్శనానికి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే సామూహిక అభిషేకాలు, సర్వదర్శనాలను నిలిపివేశారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సాయంకాల పూజలు, మహా మంగళ హారతులు జరిపించబడతాయి. అనంతరం 5 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. గ్రహణం కారణంగా శనివారం నాడు శ్రీస్వామివార్ల నిత్యకల్యాణం కూడా నిలివేశారు.
గ్రహణం కారణంగా ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు, సాక్షిగణపతి, హాఠకేశ్వరం, పాలధార- పంచధార, శిఖరేశ్వరం తదితర ఉపాలయ ద్వారాలు కూడా శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత మూసివేయనున్నారు. అలాగే అన్నప్రసాద వితరణ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి అల్పాహార వితరణ కూడా నిలిపివేస్తారు.
సామూహిక అభిషేకాలు ఉదయం మాత్రమే నిర్వహిస్తారు. అలాగే