శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల హుండీలను ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది. శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు నిత్యాన్నదానంలో హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,09,52,777 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.
అలాగే రూ.7,02,029 అన్నదాన హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. వీటితో పాటు 267 గ్రాముల బంగారం, ఐదుకిలోలకుపైగా వెండి ఆభరణాలు, 323 యూఎస్ డాలర్లు, 197 సౌదీ రియాల్స్, 137 కెనడా డాలర్లు, 40 ఆస్ట్రేలియా డాలర్లను భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించినట్లు ఆలయ అధికారులు వివరించారు.