హైదరాబాద్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం శ్రావన మాస శోభను సంతరించుకున్నది. మల్లన్న సన్నిధిలో నేటినుంచి శ్రావనమాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 4.30 గంటల నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో గర్భాలయ అభిషేకాలను నిలిపివేశారు.
రోజుకు మూడు విడతల్లో సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో సామూహిక అభిషేక భక్తులకు స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారు. ఆశీర్వచన మండపంలో అమ్మవారి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. అయితే శని, ఆది, సోమవారాల్లో భ్రమరాంబాదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిలిపివేస్తారు.