శ్రీశైలం : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం కుమారస్వామి అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు చేశారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాన ఆలయంలో నందిమండపంలో కొలువైన శనగల బసవన్నకు శుద్ధోకాలు, ఫలోదకాలతో అభిషేకించి షోడషోపచార పూజలు చేశారు. నందీశ్వరునికి శనగలు నైవేద్యంగా సమర్పించారు. నిత్యకళారాధనలో భాగంగా మహబూబాద్కు చెందిన తాండవ కృష్ణ నృత్యాలయం చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.
భక్తుల విరాళాలు
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ పథకాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన నాగార్జున, జగన్మోహిని దేవి, కర్నూలుకు చెందిన సుబ్బరావు దంపతులు, ప్రకాశం జిల్లాకు చెందిన రాఘవులు ఆలయ అధికారులకు చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.