శ్రీశైలం : ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఓ వైపు స్పర్శ దర్శనాలు, మరో వైపు భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో దేవస్థానం మల్లికార్జున స్వామి గర్భగుడిలో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా ఆదివారం క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా కర్నాటక నుంచి భారీగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శనానికి పోటెత్తుతున్నారు. స్పర్శ దర్శనాలు, దర్శనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు స్పర్శ దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నది. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు.