భగవంతుడి నామస్మరణ మనల్ని చెడు నుంచి కాపాడుతుంది. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలికితే చాలు పాపాలు పరిహారం అవుతాయి. మనం ఏ పనిలో ఉన్నా, ఏ సమయంలో అయినా దైవనామాన్ని మననం చేస్తూ ఉండాలి.
హరేరామ హరేరామ రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే॥
ఈ మంత్రం అందరూ జపించ తగినది. క్రమం తప్పకుండా దీనిని పఠించడం ద్వారా దేవుడి కృప, చిత్తశుద్ధి కలుగుతాయి. కానీ, మన మానవులు లౌకిక బంధాల్లో కొట్టుమిట్టాడుతూ రోజులో ఒకసారైనా నామస్మరణ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. పుట్టడం, పెరగడం, తినడం, పడుకోవడం, బాధ్యతను విస్మరించడం, చనిపోవడం.. ఈ చట్రంలో ఇరుక్కుపోయాడు మానవుడు. ఇలాంటి ప్రవర్తన పశువులది. మనకూ, పశువులకు తేడా ఉండొద్దా?! అందుకే భగవన్నామాన్ని నిరంతరం స్మరించి తరించాలి
…? అభినవ విద్యాతీర్థ మహాస్వామి