తిరుమల : ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ), సాయికుమార్( Saikumar) గురువారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం మొక్కులు చెల్లించు కున్నారు. ఇద్దరికి రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందించి వేదాశ్వీరచనం అందజేశారు. వారు ఆలయం బయట అభిమానులతో ఫొటోలు దిగారు.

శ్రీవారి హుండీకి రూ. 4.39 కోట్లు ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 27 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
స్వామివారిని 78,067 మంది దర్శించుకోగా 31,158 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.39 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు . 4.16 లక్షల లడ్డూలను విక్రయించామని, 1.93 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.