మనిషిగా మంచిని స్వీకరించడం మానసికంగా బలంగా ఉన్నప్పుడే సాధ్యం. మరి మానసికంగా మహోన్నతంగా మారడం ఎలా? అది అనుకున్నంత సులభం కాదు. కానీ, సద్గురువులను ఆశ్రయిస్తే అందుకు మార్గం దొరుకుతుంది. అలాంటి మార్గాన్ని సహజయోగా ద్వారా ప్రపంచానికి నిర్దేశించారు మాతాజీ నిర్మలాదేవి. 1923 మార్చి 21న జన్మించిన మాతాజీ ఓ ఆధ్యాత్మిక చైతన్యం. ఆమె శతజయంతి ఉత్సవం మంగళవారం జరగనున్నది. ఈ సందర్భంగా ఈ నెల 21న అంతర్జాతీయంగా సహజయోగా ధ్యానంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది మాతాజీ నిర్మలాదేవి ట్రస్ట్.
ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పాల్గొనొచ్చు. మరిన్ని వివరాలు www.sahajayoga telangana.org వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 1970 మే 5న ఆమె ఆవిష్కరించిన సహజయోగా ప్రస్తుతం సుమారు 110 దేశాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలాది మంది సహజయోగా సాధన ద్వారా తమ దైనందిన జీవితాల్లో శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. అసహజమైన భావోద్వేగాలు, ఆందోళన నుంచి బయటపడుతున్నారు.