తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవ ద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడని ఆలయ అర్చకులు తెలిపారు.
రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుంచి తెలుస్తోందని వివరిం చారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్సేవ, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గజ వాహనంపై శ్రీ కోదండ రామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, భక్తులు పాల్గొన్నారు.