TTD News | లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్ర కార్తీక మాసంలో తిరుమలలో విష్ణు పూజలు జరుపనున్నారు. వచ్చే నెల 4 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల పాటు ఈ పూజలు జరుగుతాయి. తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పూజలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
నవంబరు 4న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా, నవంబరు 5న మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కైశికద్వాదశి – శ్రీ తులసీ దామోదర పూజ, నవంబరు 10న ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గోపూజ, నవంబరు 21న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధన్వంతరి జయంతి నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొన్నది.