మనం నైవేద్యంగా సమర్పించిన పదార్థాలు భగవంతుడు ఆరగిస్తాడా? అన్న ప్రశ్నకు సమాధానం బ్రహ్మపురాణంలో లభిస్తుంది.
నైవేద్యం పురతోన్యస్తం చక్షుషా గృహ్యతే మయా రసంచ దాస జిహ్వ యా మశ్నామి కమలోద్భవా॥
‘బ్రహ్మదేవా! నా ఎదుట ఉంచిన నివేదన పదార్థాలు, నా నేత్రాలతో గ్రహించి, వాటి రుచి రసాలను భక్తుడి నాలుక ద్వారా తెలుసుకుంటాను’ అన్నాడు శ్రీమహావిష్ణువు. దేవతలు పరోక్ష ప్రియులు. భక్తుడి ద్వారా భగవంతుడు మనం పెట్టిన ప్రతి నివేదన పదార్థాన్నీ స్వీకరిస్తాడని నమ్మకం కలిగితే.. ఏ సందేహానికీ తావుండదు.
– శ్రీ