ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవుడికి అర్పించుకోవడం. ఈశ్వరుడిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు.
సర్వకార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్న కారణంగా దానికి మనం లోబడి ఉండాలి. అంతేకానీ, ‘అలా చేయాలి, ఇలా చేయాలి’ అని ప్రణాళికలు వేయడం దేనికి? రైలుబండి ప్రయాణికులతోపాటు వారి సామాన్లన్నీ మోస్తుందని తెలుసు. అయినా, మన సంచి ఓ మూలన ఉంచి హాయిగా ప్రయాణించకుండా.. దానిని మన నెత్తికి ఎత్తుకొని ఈసురోమనడం ఎందుకు?
-రమణ మహర్షి