షిర్డీ : సాయిబాబా భక్తులకు షిర్డీ దేవస్థానం శుభవార్త చెప్పింది. రోజుకు మరో 10వేల మందికి అదనంగా బాబా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్లో బాబా ఆలయంలో దర్శనాలు నిలిపివేయగా.. అక్టోబర్ 7 నుంచి మళ్లీ పునః ప్రారంభించి, రోజుకు 10వేలమంది దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.
ప్రస్తుతం రోజుకు 25వేల మంది భక్తులను ఆలయంలో దర్శనానికి అనుమతి ఇస్తూ అహ్మదర్నగర్ కలెక్టర్ రాజేంద్ర భోంస్లే ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో మరో 10వేల మందిని దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ.. ప్రతిరోజు ఆఫ్ లైన్ పద్ధతిలో అదనంగా 10వేల మంది భక్తులను అనుమతించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ ట్రస్ట్ హామీ ఇచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. కొవిడ్కు ముందు బాబా దర్శనానికి ప్రతి రోజుల లక్షల సంఖ్యలో భక్తులు షిర్డీకి వచ్చ వారు.