అమరావతి : తెలుగురాష్ట్రాల్లో వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) కు భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల వల్ల కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. ఏటీసీ గెస్ట్హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 80,048 మంది భక్తులు దర్శించుకోగా 35,403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.17 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. వారం రోజులుగా ప్రతిరోజు 80వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.